21 March, 2026 | 5:28 PM

రైతులకు మద్దతు ధర ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం

21-03-2026 02:13 PM

జగదేవపూర్, (విజయక్రాంతి): జగదేవపూర్ మండల కేంద్రంలోని ప్యాక్స్ గోదాముల సముదాయంలో ప్రభుత్వ మొక్క జొన్న, శనగల కొనుగోలు కేంద్రాన్ని గజ్వెల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఒంటెరు నరేందర్ రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ హరినాథ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్బంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల, బడుగు బలహీన వర్గల ప్రభుత్వం అన్నారు.రైతుల పండించిన ప్రతి గింజకు మద్దతు ధర ఇచ్చి రైతే రాజు అన్న నానుడి నిజం చేయడమే లక్ష్యం అన్నారు.

మొక్క జొన్నలకు క్వింటలకు 2400/- శనగలకు 5875/- మద్దతు ధర ఇస్తున్నాట్లు తెలిపారు. రైతులు సద్వినియోగం  చేసుకువాలి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్యాక్స్ సీ యి ఓ  రాములు,గొల్లపల్లి సర్పంచ్ మహేందర్,వార్డు సభ్యులు బచ్చలి భాస్కర్, ఆంజనేయులు,దండే వెంకటేష్,బింగి అనిత శేఖర్, మంజుల బాల్ నర్సు,బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బుద్ధ నాగరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు దయాకర్ రెడ్డి,బింగి నర్సింలు,శివజ్యోతి జహంగీర్, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.