18-10-2025 07:32:25 PM
చికిత్స పొందుతూ మృతి
పాపన్నపేట (విజయక్రాంతి): పురుగు మందు సేవించి చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఆరేపల్లిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మష్కరి లక్ష్మయ్య(57) వ్యవసాయం చేసుకుంటూ జీవితం గడుపుతున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలున్నారు. ఇటీవల కొంతకాలంగా మద్యానికి బానిసగా మారడంతో ఇంట్లో తరుచూ చిన్న పాటి గొడవలు జరుగుతున్నాయి.
లక్ష్మయ్య ఈనెల 16న మద్యం సేవించి ఇంటికి రాగా మద్యం తాగొద్దని కుటుంబీకులు నచ్చజెప్పగా మనస్తాపం చెంది ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. గుర్తు తెలియని పురుగు మందు సేవించి ఇంటికి వచ్చాడు. లక్ష్మయ్య నోటి నుంచి నురగలు వస్తుండగా కుటుంబీకులు గమనించి చికిత్స కోసం మెదక్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.