30-05-2025 01:22:56 PM
అప్పు విషయంలో గొడవ
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
రాజేంద్రనగర్: డబ్బుల విషయంలో గొడవ(Financial issues) జరగడంతో ఓ వ్యక్తి స్నేహితుడిని దారుణంగా చంపేశాడు. తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్(Rajendranagar Police Station) పరిధిలోని బుద్వేల్ లో గురువారం అర్ధరాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ ప్రాంతానికి చెందిన సాయి కార్తీక్, పులివెందులకు చెందిన సిద్ధార్థ రెడ్డి స్నేహితులు. ఇలా ఉండగా సాయి కార్తీక్ 8 లక్షల రూపాయలు సిద్ధార్థ రెడ్డి వద్ద అప్పుగా తీసుకున్నాడు. డబ్బులు తిరిగి చెల్లించడంలో సాయి కార్తీక్ కాలయాపన చేస్తున్నాడు. బుద్వేల్(Budwel)లో ఉంటున్న సాయి కార్తీక్ రూంలో గురువారం అర్ధరాత్రి వీరిద్దరూ మరో స్నేహితుడుతో కలిసి పూటుగా మద్యం తాగారు. ఈ క్రమంలో మరో మారు డబ్బుల విషయమై గొడవ జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన సిద్ధార్థ రెడ్డి స్నేహితుడైన సాయి కార్తీక్ పై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు కేసు దర్యాప్తు లో ఉంది.