31-05-2025 09:20:08 AM
హైదరాబాద్: మాదాపూర్ పోలీస్ స్టేషన్(Madhapur Police Station) పరిధిలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం అర్ధరాత్రి ఇద్దరు యువకులను బెదిరించి దుండగులు దోపిడికి ప్రయత్నించారు. మాదాపూర్ లో ఇద్దరు యువకులపై నలుగురు దుండగులు దాడి చేశారు. దుండగులు ఇద్దరు యువకులపై కత్తులతో దాడి చేయడంతో ఒకరు మృతి చెందారు. మృతుడు ఖాజాగూడకు(Khajaguda) చెందిన జయంత్ గౌడ్ గా గుర్తించారు. దుండగుల దాడిలో మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడు జయంత్ గౌడ్ తల్లి పుట్టిన రోజు వేడగలను జరడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. స్నేహితులతో పార్టీ చేసుకుంటున్న సమయంలో దుండగులు దాడి చేశారు. దుండగులు కత్తులతో బెదిరించి దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నామని మాదాపూర్ పోలీసులు వెల్లడించారు.