15 April, 2026 | 1:35 PM

Breaking News

అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •  

ఆర్థిక ఇబ్బందులతో టిఫన్ సెంటర్ నడుపుతున్న వ్యక్తి ఆత్మహత్య

06-01-2026 08:36 PM

మునుగోడు,(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా, నారాయణపురం మండలం పోర్లగడ్డతండా గ్రామానికి చెందిన వడ్య భాస్కర్ తండ్రి లచ్య (34), లంబాడా కులం అనే వ్యక్తి గత 4 సంవత్సరాల నుండి  మునుగోడు టౌన్ లోని చండూర్ రోడ్డు లో టిఫిన్ సెంటర్ నడుపుకుంటూ అతని భార్య పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు.

హోటల్ వ్యాపారం సరిగా జరగక ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడి అప్పులు కావడంతో మనస్థాపనికి గురై సోమవారం రాత్రి అందరు నిద్రిస్తున్న సమయంలో మునుగోడులోని అతను అద్దెకు తీసుకున్న నివాసంలో ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోగా, మంగళవారం తెల్లవారుజామున 04:00 గంటలకు మృతిని భార్య, తండ్రి నిద్రలేచి చూసేసరికి అప్పటికే మరణించడంతో మృతిని తండ్రి లచ్య మునుగోడు పోలీస్ నందు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఇరుగు రవి తెలిపారు.