8 June, 2026 | 9:54 PM

Breaking News

మంథనిలో ప్రశాంతంగా ముగిసిన గీత పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు   •   ఇంటర్‌లింక్ లైన్ వ్యవస్థతో నిరంతరాయ విద్యుత్ సరఫరా   •   ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా యూపీహెచ్సి రామవరం లో అవగాహన కార్యక్రమం   •   ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కార్యశాల   •   పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ బదిలీ   •   సునంద రైస్ ఇండస్ట్రీ ట్రెండ్ లైసెన్స్ ను వెంటనే రద్దు చేయాలి   •   బదిలీపై వెళ్లిన పంచాయతీ కార్యదర్శికి సన్మానం చేసిన గ్రామస్తులు   •   ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలి   •   పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజలపై పెను భారం మోపుతున్న మోదీ సర్కార్   •   పరిసరాల పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణకు ప్రజలు సహకరించాలి   •  

ఆర్థిక ఇబ్బందులతో టిఫన్ సెంటర్ నడుపుతున్న వ్యక్తి ఆత్మహత్య

06-01-2026 08:36 PM

మునుగోడు,(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా, నారాయణపురం మండలం పోర్లగడ్డతండా గ్రామానికి చెందిన వడ్య భాస్కర్ తండ్రి లచ్య (34), లంబాడా కులం అనే వ్యక్తి గత 4 సంవత్సరాల నుండి  మునుగోడు టౌన్ లోని చండూర్ రోడ్డు లో టిఫిన్ సెంటర్ నడుపుకుంటూ అతని భార్య పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు.

హోటల్ వ్యాపారం సరిగా జరగక ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడి అప్పులు కావడంతో మనస్థాపనికి గురై సోమవారం రాత్రి అందరు నిద్రిస్తున్న సమయంలో మునుగోడులోని అతను అద్దెకు తీసుకున్న నివాసంలో ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోగా, మంగళవారం తెల్లవారుజామున 04:00 గంటలకు మృతిని భార్య, తండ్రి నిద్రలేచి చూసేసరికి అప్పటికే మరణించడంతో మృతిని తండ్రి లచ్య మునుగోడు పోలీస్ నందు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఇరుగు రవి తెలిపారు.