12 July, 2026 | 3:32 PM

Breaking News

సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •  

ఎమ్మార్పీఎస్ ర్యాలీ.. మందకృష్ణ మాదిగ అరెస్టు

09-10-2024 04:06 PM

హైదరాబాద్,(విజయక్రాంతి):  ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈరోజు ఉదయం పార్సిగుట్టలో ఉన్న ఎమ్మార్పీఎస్ పార్టీ కార్యాలయంలో నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీని చేప్పట్టారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు ముందస్తూ అనుమతి లేకపోవడంతో ఇందిరా పార్క్ వద్దకు ఎమ్మార్పీఎస్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మార్పీఎస్ శ్రేణులు ప్రతిఘటించడంతో తీవ్ర తోపులాట జరిగింది.

దీంతో ఎమ్మార్పీఎస్ శ్రేణులను పోలీసుల అదుపులోకి తీసుకుని మందకృష్ణ మాదిగను అరెస్టు చేశారు. ఎమ్మార్పీఎస్ శ్రేణులను వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేయకోవడంతో మాదిగ బిడ్డలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు. డీఎస్సీ భర్తీలో కూడా మాదిగలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని, మాలలకు లబ్ధి చేకురుస్తుందని మందకృష్ణ మాదిగ ఆరోపణలు చేశారు.