12 July, 2026 | 2:44 PM

Breaking News

చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •  

ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి

12-07-2026 02:07 PM

ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఆదిత్య

సిద్దిపేట,(విజయక్రాంతి): విద్యా సంస్థల సమస్యలు పరిష్కారం కొరకు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ నెల 14న నిర్వహించ తలపెట్టిన కాళశాలల బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబెర్ ఆదిత్య పిలుపునిచ్చారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రం లో ఇప్పటి వరకు 12 వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని మండిపడ్డారు.

దాదాపు 20 లక్షల పెద విద్యార్థుల జీవితాలు, చదువులు రియంబర్మెంట్ తో ముడిపడి ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఫీజు బకాయిలు లేకుండా చేస్తామన్న చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ పడుకున్నావని ప్రశ్నించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా బంద్ కు సంబందించిన వాల్ పోస్టర్ ని విడుదల చేశారు.కళాశాలల బంద్ కార్యక్రమానికి విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, యాజమాన్యాలు అందరూ సహకరించాలని కోరారు.