16-06-2025 05:56:45 PM
మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మహదేవపూర్ మండలంలోని కాలేశ్వరం, అన్నారం గ్రామాలలోని ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ షాపులను మండల వ్యవసాయ అధికారిని సుప్రజ్యోతి(Mandal Agriculture Officer Suprajyothi) సోమవారం తనిఖీలు నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారిని మాట్లాడుతూ... పత్తి విత్తనాల నిల్వలను పరిశీలించి విత్తన కంపెనీల సర్టిఫికెట్స్ ను, స్టాక్ రిజిస్టర్ లను తనిఖీలు చేసారు.
పత్తి నాసిరకం విత్తనాలు అమ్మినచో కేసులు నమోదు చేస్తూ లైసెన్సు రద్దు చేస్తామని ఫెర్టిలైజర్ షాప్ లో యజమానులను హెచ్చరించారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేస్తే తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని రోజువారీగా నమోదు చేయాలన్నారు. విత్తనాలను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు కొనుగోలు చేసిన విత్తనాల రసీదును భద్రపరుచుకోవాలని రైతులను కోరారు. ఈ తనిఖీలలో ఏఈవోలు పాల్గొన్నారు.