14-07-2025 12:23:54 AM
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్, జులై 13 : భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మన్సూరాబాద్ రోడ్డును విస్తరించాలి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. మన్సూరాబాద్ డివిజన్ కాస్మోపాలిటన్ కాలనీలో నూతనంగా నిర్మించిన పార్కును ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పార్క్ ఆవరణలో ఐదేండ్ల క్రితం ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ పరికరాలు పరిశీలించారు.
అప్పట్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ పరికరాలు ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉన్నాయని, ప్రస్తుతం పార్కుల్లో నిర్మించే ఓపెన్ జిమ్ పరికరాలు నాసిరకంగా ఉంటూ కొన్ని రోజులకే విరిగిపోతున్నాయి అన్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కాస్మోపాలిటన్ కాలనీలో ఉన్న విశాలమైన స్థలంలో అప్పట్లోనే కమ్యూనిటీ హాల్, ఆటస్థలం కోసం ప్రతిపాదనలు పంపామని గుర్తు చేశారు.
రాబోయే తరాల ను దృష్టికి పెట్టుకుని మాన్సూరాబాద్ రోడ్డును విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ మాజీ అధ్యక్షుడు జగదీష్ యాదవ్, నాయకులు టంగుటూరి నాగ రాజు, జక్కిడి రఘువీర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, భాస్కర్ యాదవ్, కాలనీవాసులు రుద్ర లక్ష్మీ నర్సింహ, శ్రీకాంత్, శ్రీనివాస్, సత్తయ్య, భాస్కర్, రమేష్, గోపాల్, జ్ఞానేశ్వర్ తదితరులుపాల్గొన్నారు.