14-07-2025 12:22:36 AM
బెల్లంపల్లి ప్రభుత్వ హైస్కూల్ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం..
బెల్లంపల్లి అర్బన్, జూలై 13 : ఆ విద్యార్థులు, విద్యా బోధకులు వెరసి 50 ఏళ్లకు కలుసుకున్నారు. బెల్లంపల్లి ప్రభుత్వ హై స్కూల్ (చెరువు కట్టబడి) విద్యార్థుల, ఉపాధ్యాయుల అపూర్వ కలయిక ఆద్యంతo భావోద్వేగానికి గురిచేసింది. 1974 పదోతరగతి బ్యాచ్ కి చెందిన బెల్లంపల్లి బస్తి హైస్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనుభూతులను పంచింది. పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆనం దోత్సవాల మధ్య జరుపుకున్నారు.
విద్యార్థులు యాభై ఏళ్ల తర్వాత విద్యాబుద్ధులు నేర్చుకున్న పాఠశాలలో, ఉపాధ్యాయులను కలుసుకోవడం మర్చిపోలేని జ్ఞాపకాలుగా నెమరు వేసుకున్నారు. పూర్వ సమ్మేళనంలో పూర్వ హెడ్మాస్టర్ జీ వెంకటయ్య, పూర్వ ఉపాధ్యాయులు గట్టు శ్రీహరి, ఎస్ జగన్నాథరావు, కృష్ణారావు, ప్రస్తుత హెడ్మాస్టర్ మాధవి, ఉపాధ్యాయు లు సతీష్, పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు వస్త్రాలు, పూలమాలలు, శాలువాలతో ఆత్మీ య సత్కారం చేసి జ్ఞాపికలు అందజేశారు.