29-06-2025 01:58:34 AM
లొంగిపోయిన వారిలో 8 మంది మహిళా మావోయిస్టులు
బీజాపూర్, జూన్ 28: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ భద్రతాదళాల ఎదు ట శుక్రవారం 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపో యిన మావోయిస్టుల్లో 8 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల తలలపై రూ. 23 లక్షల రివార్డు ఉన్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆప రేషన్ కగార్తో మావోయిస్టులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.
ఈ 13 మందితో కలిపి ఈ ఏడాది లొంగిపోయిన మావోయిస్టుల సంఖ్య 241కి చేరుకుంది. లొంగిపోయిన వారిలో దేవే ముఛకి అలియాస్ ప్ర మీల (21) అనే మహిళా మావోయి స్టు తలపై రూ. 8 లక్షల నజరానా, కోస ఓయం అలియాస్ రాజేంద్ర అలియాస్ మహేశ్ అలియాస్ మహేశ్ సాగర్ అలియాస్ రమేష్ (29)పై 5 లక్షల నజరానా, కోసి పొడియం (27) అనే మహిళా మావోయిస్టు తలపై 2 లక్షలు,
సెమ్మి సెమల (23), ఛోటు పర్సిక్ అలియాస్ దీపక్ (25), మోతి తాతి (24), సునీత హేమల (24), మంజుల కుంజం (23), సాయిబో పొడియం (18), హుంగీ ఉండుమ్ అలియాస్ రాధ (21) అనే మావోయిస్టుల తలలపై రూ. లక్ష మేర నజరానా ఉన్నట్టు అధికారులు తెలిపారు. లొంగిపోయిన మా వోయిస్టులకు ఒక్కొక్కరికి రూ. 50వేలు, పునరావాసం కల్పించనున్నారు.