17 April, 2026 | 2:42 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

బాబా.. నన్ను మానభంగం చేశారు

29-06-2025 02:00 AM
  1. ఆరు నెలల్లో 12 సార్లు అత్యాచారం చేసినట్టు మహిళ ఆరోపణలు
  2. నిందితుడు బీజేపీ పార్టీ అత్యంత సన్నిహితుడు

కోల్‌కతా, జూన్ 28: భారత నాలుగో అత్యున్నత పురస్కారం ‘పద్మశ్రీ’ అందుకున్న పశ్చిమబెంగాల్‌కు చెందిన కార్తిక్ మహరాజ్ అనే బాబా ఆశ్రమంలోనే తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఒక మహిళ ఆరోపించింది. నిందితుడు పాఠశాలలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికి 2013 నుంచి పలుమార్లు అత్యాచారం చేశాడని బాధిత మహిళ ఆరోపించింది. బీజేపీకి అత్యంత సన్నిహితుడయిన ఆ బాబా ఈ ఆరోపణలను ఖండించారు.

ముర్షిదాబాద్‌లో తనకు భారత్ సేవాశ్రమ్ సంఘ పేరిట ఉన్న ఆశ్రమంలోకి తీసుకెళ్లి అనేక సార్లు అత్యాచారం చేసినట్టు వెల్లడించింది. జనవరి 2013 నుంచి ఆరునెలల కాలంలో ఆ బాబా తనపై కనీసం 12 సార్లు అత్యాచారానికి ఒడిగట్టాడని ఆమహిళ ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలను కార్తిక్ మహరాజ్ బాబా ఖండించారు. ఆ మహిళ ఆరోపణల మేరకు కార్తిక్ మహరాజ్ మీద కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.