20 July, 2026 | 5:45 PM

Breaking News

తాగునీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్   •   ఓటరు జాబితా సవరణ సర్ కార్యక్రమాన్ని విజయవం చేయాలి   •   వారాహి మాత మాలధారణ స్వాములకు అన్నప్రసాద వితరణ   •   శ్రీ ఉమామహేశ్వరం ఆలయ అభివృద్ధికి దాతల చేయూత   •   మున్సిపాలిటీలోనూ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి   •   సింగరేణి డిస్పెన్సరీని పునఃప్రారంభించిన డైరెక్టర్ (పి&పి) కె. వెంకటేశ్వర్లు   •   ముద్దసాని దామోదర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివి   •   మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి   •   తెలంగాణ రక్షణ సమితిలో చేరిన మండల యువకులు   •  

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల భారీ ఆపరేషన్

20-07-2026 12:17 AM

237 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు 

శేరిలింగంపల్లి,జూలై 19 (విజయక్రాంతి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ బృందాలు ఈ వీకెండ్లో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి భారీ స్థాయిలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని అరెస్టు చేశాయి.ఈ తనిఖీల్లో మొత్తం 237 మంది డ్రైవర్లు పట్టుబడ్డారు.

అందులో 205 మంది బైక్ రైడర్లు,28 మంది కారు డ్రైవర్లు, నలుగురు ఆటో డ్రైవర్లు ఉన్నారు. తనిఖీల సమయంలో చాలా మంది డ్రైవర్ల రక్తంలో మద్యం స్థాయి 36 ఏంజీ నుంచి 200 ఎంజీ వరకు ఉన్నట్టు గుర్తించారు. మొత్తం 219 మందిపై ఈ రేంజ్లో మద్యం శాతం నమోదైంది. గత వారం డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధిత 309 కేసులు పరిష్కరించినట్టు అధికారులు వెల్లడించారు. వీటిలో ఐదుగురికి జైలు శిక్షలు విధించినట్లు తెలిపారు.