08-06-2025 12:33:25 AM
న్యూఢిల్లీ, జూన్ 7: ‘ త్వరలోనే బీహార్ ఎ న్నికలున్నాయి. బీజేపీకి ఎక్కడైతే ఓటమిభయం ఉంటుందో అక్కడ మహారాష్ట్రలో జ రిగినట్టే జరుగుతుంది. మ్యాచ్ ఫిక్సింగ్ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి విషం లాంటివి.’ అని ఆరోపిస్తూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ శనివారం ఎక్స్లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. త్వర లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే అమలు చేసేందుకు బీజేపీ స మాయత్తం అవుతోందని విమర్శించారు.
ఈ ఆరోపణల ను బీజేపీతో పాటు, కేంద్ర ఎన్నికల సంఘం కూడా తీవ్రంగా ఖండించాయి. గతేడాది మ హారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జర గ్గా.. బీజేపీ, శివసేన (ఉద్ధవ్ వర్గం), ఎన్సీపీ (అజిత్ ప వార్ వర్గం) జట్టుగా ఏర్పడి ‘మహాయుతి’ కూటమి పేరుతో విజయం సాధించాయి. అ ంతకు కొద్ది రోజుల ముందే జరిగిన సార్వత్రి క ఎన్నికల్లో మహాయుతి కూటమి విఫలమ యి.. ఇండియా కూటమి ఆధిక్యం ప్రదర్శించింది.
దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని అంతా ఊహించి నా అలా జరగలేదు. ఎన్నికల ఫలితాలు వె లువడినప్పటి నుంచే కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు రిగ్గింగ్ ఆరోపణలు చేసుకు ంటూ వస్తున్నారు. రిగ్గిం గ్ ఆరోపణలను కే ంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడూ ఖ ండిస్తూ వస్తోంది. ఈ ఏడాది నవంబర్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.ప్రజాస్వామ్య రిగ్గింగ్కు
ఈ ఎన్నికలే ఉదాహరణ..
‘ప్రజాస్వామ్య రిగ్గింగ్కు 2024లో జరిగి న మహారాష్ట్ర ఎన్నికలు ఒక బ్లూ ప్రింట్ లా ంటివి. 1వ దశ) ఎన్నికల కమిషన్ నియామ కం. 2వ దశ) నకిలీ ఓటర్ల నమోదు. 3వ ద శ) పోలింగ్ శాతంలో అనూహ్య మార్పు లు, అవకతవకలు. 4వ దశ) ఎక్కడైతే బీజేపీ వి జయం అవసరమో అక్కడ దొంగ ఓటింగ్పై ఆధారపడటం. 5వ దశ) ఆధారాలను ధ్వ ంసం చేయడం, దాచిపెట్టడం. బీజేపీ ఎ ందుకు అలా చేసిందో సులభంగా అర్థం చే సుకోవచ్చు.
రిగ్గింగ్ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ వ ంటిదే. మోసం చేసి ఎన్నికల ఆటలో గెలవచ్చు. అలా వచ్చిన గెలుపు వ్యవస్థలను నా శనం చేయడమే కాకుండా ఎన్నికల ఫలితాలపై ప్రజలకున్న విశ్వాసాన్ని సన్నగిల్లేలా చే స్తుంది. ప్రజలందరూ ఆధారాలను గమని ంచి సమాధానాల కోసం డిమాండ్ చే యాలి.
త్వరలోనే బీహార్ ఎన్నికలున్నాయి. బీజేపీకి ఎక్కడైతే ఓటమిభయం ఉంటుందో అక్కడ ఇదే జరుగుతుంది. మ్యాచ్ ఫిక్సింగ్ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి విషం లాంటివి.’ అని ఆరోపించారు. ఈ అంశాలనే జాతీయ మీడియా కాలమ్లోనూ ప్రస్తావించారు.
రాహుల్ వ్యాఖ్యలు అసంబద్ధం: ఈసీ
రాహుల్ గాంధీ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ఎన్నికల సంఘం (ఈసీ) తోసిపుచ్చింది. ఆయన వ్యాఖ్యలు పూర్తి అసంబద్ధం అని పేర్కొంది. ‘ఓటర్లు ప్రతికూల తీర్పు ఇచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ మీద ఆరోపణలు చేయడం సరికాదు.’ అని ఘాటుగా స్పందించింది. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఆరోపణలపై డిసెంబర్ 2024లోనే ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. ‘కాంగ్రెస్ అభ్యంతరాలపై గతేడాది డిసెంబర్ 24వ తదీనే ఈసీ స్పష్టతనిచ్చింది.
ఈసీఐ వ్బుసైట్లో పూర్తి డేటా అందుబాటులో ఉంది. పదే, పదే ఇటువంటి ఆరోపణలు చేస్తూ వాస్తవాలను పూర్తిగా విస్మరిస్తున్నారు.’ అని ఈసీ పేర్కొంది. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ కూడా రాహుల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. ‘ఎన్నికల సంఘం వివరణ ఇచ్చినా కానీ రాహుల్ పదే, పదే ఇవే ఆరోపణలు చేస్తూ ఎన్నికల ప్రక్రియపై అందరికీ అనుమానాలు రేకెత్తిస్తున్నారు.
అందరినీ గందరగోళానికి గురిచేస్తున్నారు.’ అని విమర్శించారు. ఆనాడు మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 288 సీట్లకు గానూ బీజేపీ కూటమి 235, ఇండియా కూటమి (మహావికాస్ అఘాడి) 50 సీట్లు గెల్చుకున్నాయి.