2 May, 2026 | 1:29 AM

కార్మిక హక్కుల కోసం పోరాటం కొనసాగిద్దాం

02-05-2026 12:36 AM

బచ్చోడులో న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు

తిరుమలాయపాలెం, మే 1 (విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామంలో ప్రపంచ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ గ్రామ కార్యదర్శి ఆడెపు నగేష్ జెండా ఎగురవేయగా, రాష్ట్ర నాయకులు మందుల రాజేంద్రప్రసాద్ జెండాను ఆవిష్కరించి అనంతరం కార్మికుల హక్కులపై ప్రసంగించారు. శ్రామిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు, కనీస వేతనాలు, పని భద్రత, సామాజిక రక్షణ అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్ మాట్లాడుతూ కార్మికులు ఐక్యంగా ఉంటేనే తమ హక్కులను సాధించగలరని, శ్రామిక ఉద్యమాల అవసరం ఇప్పటికీ కొనసాగుతోందని తెలిపారు. మేడే ప్రాముఖ్యతను వివరించి కార్మికుల త్యాగాలను స్మరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు గొర్రెపాటి వీరస్వామి, మాగి విజయ్, సకినాల వెంకన్న, వల్లపు బిక్షం, రామకృష్ణ, కోటయ్య, డి కృష్ణ, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.