6 May, 2026 | 10:58 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

చెరువుల పరిరక్షణకు చర్యలు

28-11-2024 01:22 AM

హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 27 (విజయక్రాంతి): మహానగర పరిధిలోని చెరువుల పరిరక్షణకు హైడ్రా సమగ్ర చర్యలు చేపడుతున్నదని కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. బుధవారం ఆయన నిజాం తలాబ్ లేక్ (తురక చెరువు), మాదాపూర్ మేడికుంట చెరువు, ఈదులకుంట, నార్సింగ్ నెక్నాంపూర్ చెరువు, తెల్లాపూర్ వనంచెరువు, చెల్లికుంట, మేళ్ల చెరువును సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయనకు స్థానికులు చెరువుల ఆక్రమణ గురించి వివరించారు. చెరువులను కబ్జా నుంచి విడిపించి, పూర్వవైభవం తీసుకురావాలని వినతి పత్రాలు అందజేశారు. చెరువుల సుందరీకరణ పేరుతో బఫర్ జోన్ ప్రాంతాలను కొందరు కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. గేటెడ్ కమ్యూనిటీల నుంచి వచ్చే మురుగు చెరువుల్లోకి వదులుతున్నారని వాపోయారు. కమిషనర్ స్పందిస్తూ..  చెరువులు కబ్జా కాకుండా చర్యలు తీసుకుంటా మని స్థానికులకు హామీ ఇచ్చారు.