6 March, 2026 | 3:09 AM

మెడికవర్ ఆస్పత్రి అరుదైన ఘనత

06-03-2026 12:00 AM

84 ఏళ్ల వృద్ధురాలికి క్లిష్టమైన వెన్నెముక శస్త్రచికిత్స 

హైదరాబాద్, మార్చి 5 (విజయక్రాంతి): వృద్ధాప్యంలో వెన్నెముక సమస్యల వల్ల నడవలేని స్థితికి చేరుకున్న ఒక వృద్ధురాలికి సికింద్రాబాద్‌లోని మెడికవర్ ఆస్పత్రి వైద్య బృందం క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి, ఆమెకు మళ్లీ నడకను ప్రసాదించారు. 84 ఏళ్ల సుజాత గత పదేళ్లుగా తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నారు. కదలలేని పరిస్థితి వచ్చారు.  వైద్య పరీక్షల్లో ఆమెకు వెన్నెముకలో తీవ్రమైన నరాల ఒత్తిడి (స్పునల్ కెనాల్ స్టెనోసిస్), వెన్నెముక క్షీణత ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

ఆమెకు మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్య వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటం శస్త్రచికిత్సను క్లిష్టతరం చేసింది.  సీనియర్ స్పున్ సర్జన్ డాక్టర్ రమేష్ శీఘాకొల్లి నేతృత్వంలోని స్పున్ సర్జన్లు, అనస్థీషియా నిపుణులు, కార్డియాలజిస్టులు, క్రిటికల్ కేర్ వైద్యుల బృందం సమగ్రంగా పరిశీలించి ‘లంబార్ డికంప్రెషన్’ శస్త్రచికిత్సను విజయవంతం గా పూర్తి చేశారు.