డబుల్ రోడ్డుకు నిధులు మంజూరు చేయాలి
బోయినపల్లి, మార్చి 5(విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మం డలం లో పలు గ్రామాల మీదుగా డబుల్ రహదారి నిర్మాణం కు నిధులు మంజూరు చేయాలని మండలంలోని సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ను కలిసి వినతిపత్రం సమర్పించారు.నాగుల మల్యాల నుండి వేములవాడ వరకు వయా విలాసాగర్, మర్లపేట, బోయినపల్లి మీదుగా డబల్ రోడ్డు మంజూరు చేయవలసిందింగా చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం కలసి వినతిపత్రం అందించారు.
ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించిన సర్పంచ్ ల ఫో రం బోయినపల్లి మండల అధ్యక్షులు భీం రె డ్డి మహేశ్వర్ రెడ్డి, బోయినపల్లి సర్పంచ్ నల్ల మోహన్, తడగొండ సర్పంచ్ ఉయ్యాలా శ్రీనివాస్ గౌడ్, దుండ్రపల్లి సర్పంచ్ జంగం అంజయ్య, వరదవెల్లి సర్పంచ్ శ్రీనివాస్ రె డ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి ,తదితరులు పఉన్నారు.




