26-01-2026 06:52:37 PM
గరిడేపల్లి యూత్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
గరిడేపల్లి,(విజయక్రాంతి): రక్తదానం చేసిన వారు ప్రాణదాతలుగా నిలుస్తారని గరిడేపల్లి గ్రామ సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ చంద్రయ్య అన్నారు. మండల కేంద్రంలో సోమవారం గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని గరిడేపల్లి యూత్ ఆధ్వర్యంలో తల సేమియా స్కిల్ సెల్ సొసైటీ హైదరాబాద్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ పెద్దలతో కలిసి ఆమె పాల్గొని మాట్లాడారు.
అన్ని దానాలుకెల్లా రక్తదానం చాలా గొప్పదని తల సేమియా వ్యాధితో బాధపడే చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పెండం శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ పైడిమర్రి రంగనాదు, గ్రామ శాఖ అధ్యక్షులు పిట్ట సైదులు,పెండం ధనయ్య గౌడ్, పరెడ్డిగూడెం గ్రామ సర్పంచ్ కేతపల్లి నరసయ్య, యూత్ సభ్యులు నకరికంటి సతీష్, హరీష్, కొత్తపల్లి రవి, శేఖర్, నకిరకంటి రవి, మాచర్ల రవి, వేణుతోపాటు 80 బ్లడ్ బ్యాగ్స్ సేకరించినట్లు వారు తెలిపారు.