27-06-2025 11:54:06 PM
మంగపేట,(విజయక్రాంతి): ములుగు జిల్లా కలెక్టర్ మరియు డిఎం అండ్ హెచ్ ఓ ఆదేశాల మేరకు మల్లూరు గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ ను నిర్వహించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో మల్లూరు డబల్ బెడ్ రూమ్ కాలనీలో ప్రతి ఇంట్లో జ్వర పీడితులు ఉండగా ప్రధానంగా డెంగ్యూతో బాధపడేవారు ఉండటం వలన వారికి వారి వారి ఇంటి చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానిక పిహెచ్సి డాక్టర్ యమునా ఆధ్వర్యంలో వివరించడం జరిగింది. ఈ మెగా క్యాంపులో 175 మంది పరీక్షలు చేసుకోగా 25 జ్వరం కేసులు నమోదు అయ్యాయని డాక్టర్ యమున తెలిపారు. ఈ మెగా హెల్త్ క్యాంపు ను స్థానిక మంత్రి సీతక్క పరిశీలించారు.