calender_icon.png 28 June, 2025 | 9:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖాకీలపై గురిపెట్టిన ఏసీబీ!

28-06-2025 12:00:00 AM

- తరచూ సివిల్ పంచాయతీల్లో దూరి అవినీతి ముడుపులు

-స్టేషన్ పరిసరాల్లోనే పంచాయతీలు సెటిల్మెంట్లతో వసూళ్ల పర్వం

-పాతుకుపోయిన పోలీసుల చేత వ్యవహారం

- కల్వకుర్తిలో స్టేషన్ బెయిల్ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్‌ఐ

- అవినీతి ఖాఖీల్లో ఏసిపి గుబులు

నాగర్ కర్నూల్ జూన్ 27 ( విజయక్రాంతి ); నాగర్ కర్నూల్ జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారికి ఏసిబి గుబులు పట్టుకుంది. అనవసరమైన సివిల్ పంచాయతీలో తల దూర్చి అమాయకులైన నిరుపేదలను బలి చేస్తూ ముడుపులు ఇచ్చే వారికి వంత పాడుతున్న ఖాఖీలపై ఏసీబీ నజర్ పెట్టినట్లు సమాచారం.

దీంతో ఆయా శాఖ ఉన్నతాధికారులు సైతం ఏసీబీ ని ఘా పెరిగింది తస్మాత్ జాగ్రత్త అంటూ రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఆయా కిందిస్థాయి ఉద్యోగులకు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. నాగర్ కర్నూల్ జిల్లాలోని దుందుభి నది, కృష్ణ పరివాహక ప్రాంతాలలో సహజ సిద్ధంగా ఏర్పడే ఇసుక మేటలను ఇసుకా సురులు అడ్డగోలుగా దోచుకుంటున్నారని వారికి రాచ బాట వేస్తున్నది పోలీసులే నని జోరుగా ప్రచారం జరుగుతోంది.

అందుకు ఇరిగేషన్, మైనింగ్ శాఖ లతోపాటు పోలీసు అధికారులు పెద్ద మొత్తంలో ముడుపులు అందుకుంటున్నట్లు ఆ రోపణలు ఉన్నాయి. దీంతో పాటు కల్తీ కల్లు దుకాణాలు, బె ల్టు దుకాణాలు, మద్యం దుకాణాలు, బస్టాండ్ పరిసరాల్లోని లాడ్జిలు, ఇలా ఇతర అక్రమ వ్యాపారాలలో నెలవారి మా మూళ్లు వసూలు చేస్తున్న వారిలో ప్రధాన పాత్ర పోలీసులదే నని జిల్లాలో జోరుగా చర్చ నడుస్తోంది.

ఇందులో కొందరు ఉన్నతాధికారుల పేర్లు కూడా వాడుకుంటున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అందుకు చాలా కాలంగా పాతుకుపోయిన పాత పోలీస్ కిందిస్థాయి సిబ్బందితో వసూళ్ల పర్వాన్ని నడిపిస్తున్నట్లు ఆరోపణలు బాహాటంగా వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజుల క్రితం ఓ మద్యం దుకాణం వద్ద 5 ఫుల్ బాటిల్లు ఇవ్వాలని లేదంటే దుకాణం మూసివేయాలని ఓ మద్యం దుకాణం వద్ద పోలీస్ సిబ్బంది చేసిన హంగామా జిల్లాలో తీవ్ర చర్చనీ అంశమైంది.

అయినప్పటికీ ఆ శాఖ ఉన్నతాధికారులు సైతం పట్టించుకోకపోవడంతో జిల్లాలోని డివిజన్ స్థా యి అధికారుల ముడుపుల దందా నానాటికీ శృతి మించుతోందని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈమధ్య ఏసీబీ అధి కారులకు సైతం ఇలాంటి ఫిర్యాదులు పెద్ద ఎత్తున అందినట్లు సమాచారం. దీంతోపాటు ప్రస్తుతం భూ సమస్యల పట్ల కలగజేసుకొని డబ్బులు ముట్ట చెప్పే వారికి వంత పాడుతున్నట్లు జిల్లా స్థాయి అధికారులకు కూడా ఫిర్యాదులు పెరుగుతున్నాయి.

అక్కడ కూడా ఆశించిన స్థాయిలో న్యాయం జరగక పోవడంతో ఏసీబీని ఆశ్రయిస్తున్నట్లు చర్చ నడుస్తోంది. ఇం దులో భాగంగానే ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన భూ పంచాయతీలో తప్పుడు కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇప్పించేందుకు 20వేలు డబ్బులు డిమాండ్ చేయడంతో రైతు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు వల పన్ని కల్వకుర్తి ఎస్త్స్ర ని పట్టుకున్న విషయం తెలిసిందే.

కందనులు జిల్లాపై ఏసీబీ నజర్..!

ప్రజలకు సేవ చేయాల్సిన ఆయా శాఖ అధికారులు తప్పు డు మార్గంలో డబ్బు సాధించడం కోసం ప్రజల నుండి అక్రమంగా డబ్బులు వస్తువులు చేసే అధికారులపై ఏసీబీ గురి పెట్టింది. నిత్యం ఎక్కడో ఒకచోట ఏసిపికి పట్టుబడుతున్న అధికా రుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా నుండి పెద్ద ఎత్తున ఏసీబీకి ఫిర్యాదులు అందడంతో దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

గత కొద్ది రోజుల క్రితం వెల్దండ ఎస్త్స్ర ఏసీబీకి పట్టుబడిన ఘటన మరువక ముందే బుధవారం కల్వకుర్తి ఎస్‌ఐ పట్టుబడ్డాడు. వెంటనే అచ్చం పేట పట్టణంలోని బీసీ బాయ్స్ హాస్టల్లో శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించింది. రెండేళ్ల నుండి రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. విద్యార్థుల పేరు చెప్పి హాస్టల్ వార్డెన్లు అడ్డగోలుగా ఆస్తులు కూడా పెట్టుకున్నట్లు ఫిర్యాదులు అందడంతోనే ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోం ది. దీంతోపాటు జిల్లాలోని ఆయా శాఖల పోలీస్ అధికారులపై ప్రత్యేక నిగా పెట్టినట్లు సమాచారం. దీంతో అవినీతికి పాల్పడే అధికారుల్లో గుబులు మొదలైంది.