అడిషనల్ కలెక్టర్కు వినతిపత్రం
21-03-2026 12:26 AM
నిర్మల్, మార్చి 20 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో రంజాన్ పండుగ నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఎంఐఎం పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షులు ముజాహిద్ అలీ ఆధ్వర్యంలో జెసికి వినతిపత్రం అందించారు. అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ కలిసి ఆయా ప్రార్థన స్థలాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.




