15-12-2025 12:00:00 AM
ముంబై, డిసెంబర్ 14 : అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ భారత్ పర్యట న ఉత్సాహంగా సాగుతోంది. తొలిరోజు కోల్కతాలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పటకీ, హైదరాబాద్లో మాత్రం మెస్సీ టూర్ సూపర్ సక్సెస్ అయింది. ఇక్క డ నుంచి ముంబై వెళ్లిన ఈ సాకర్ స్టార్కు అభిమానులు బ్రహ్మరథం పెట్టారు. ఫుట్బాల్ను అమితంగా ఇష్టపడే కొన్ని నగరాల్లో ఒకటిగా ఉన్న ముంబై ఫ్యాన్స్ సాకర్ దిగ్గజానికి అపూర్వ స్వాగతం పలికారు.
చారిత్రక వాంఖేడే స్టేడియం అభిమానులతో నిండిపోయింది. కోల్కతా ఘటన దృష్ట్యా ముం బైలో భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు పూర్తి జాగ్రత్తలు తీసు కున్నారు. షెడ్యూల్ ప్రకారమే మెస్సీ పర్యటన ప్రశాంతంగా ముగిసేలా చేయడంలో అటు నిర్వాహకులు, ఇటు పోలీసులు విజయవంతమయ్యారు. మిత్రా స్టార్స్, ఇండి యా స్టార్స్ మధ్య జరిగిన ఎగ్జిబిషన్ ఫ్రెండ్లీ మ్యాచ్ అలరించింది. ఇండియా స్టార్స్ టీమ్ లో సెలబ్రిటీలు టైగర్ ష్రాఫ్, డినో మోరి యా, హాక్ ప్లేయర్ బాలాదేవి ఆడారు.
మహారాష్ట్ర సీఎం దేవంద్ర ఫడ్నివస్, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, క్రికెటర్ హర్భ జన్ సింగ్ వంటి ప్రముఖులు హాజరయ్యా రు. మెస్సీ స్టేడియంలోకి రాగానే అభిమానులు స్టాండింగ్ ఒవేషన్తో వెల్కమ్ చెప్పా రు. అనంతరం సీఎం ఫడ్నివస్తో పాటు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను మెస్సీ కలిసాడు. ఈ సందర్భంగా సచిన్ మెస్సీకి తన టీమిండియా జెర్సీని కాసుకగా అందజేశా డు. అలాగే మెస్సీ తాను ఆటోగ్రాఫ్ చేసిన ఫుట్బాల్ను బహుమతిగా అందించాడు.
వీరిద్దరి జెర్సీ నెంబర్లు 10 కావడం, ఇద్దరు దిగ్గజాలు ఒకే చోట కనిపించడంతో స్టేడి యం మొత్తం కేరింతలతో హోరెత్తిపోయిం ది. యువ సాకర్ ప్లేయర్స్ను గుర్తించే ప్రాజె క్ట్ మహాదేవాను మెస్సీ అధికారికంగా ప్రా రంభించాడు. అనంతరం గాళ్స్ సాకర్ టీమ్స్తో కాసేపు ఫుట్బాల్ ఆడాడు. వారి తో ముచ్చటించిన మెస్సీ స్టేడి యం అంత టా తిరుగుతూ అభిమానులను పలకరించారు. వారి పైకి ఫుట్బాల్స్ కిక్ చేసి జోష్ పెంచాడు. చివరిరోజు సోమవారం మెస్సీ ఢిల్లీ వెళ్లనున్నాడు. చివరిగా ప్రధాని నరేంద్రమోదీతోనూ మెస్సీ సమావేశం కానున్నాడు.