17 April, 2026 | 2:42 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

మెట్రో మరో‘సారి’..

02-04-2025 11:39 PM

సాంకేతిక సమస్యలతో నిలిచిపోయిన మెట్రో రైలు..

ఇబ్బంది పడ్డ ప్రయాణికులు..

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రో రైలులో బుధవారం సాయంత్రం మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఎల్‌బీనగర్ నుంచి మియాపూర్‌కు వెళుతున్న ఓ మెట్రో రైలు అసెంబ్లీ మెట్రో స్టేషన్ వద్ద నిలిచిపోయింది. దీంతో దాదాపు 15 నిమిషాల పాటు మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. మెట్రోలో సమస్య తలెత్తడంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. మెట్రో సిబ్బంది వెంటనే సమస్యను పరిష్కరించడంతో తర్వాత మెట్రో సేవలు యథావిధిగా కొనసాగాయి. దీంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రతీ రెండు నెలలకోసారి మెట్రో రైలు సర్వీసులో సమస్యలు తలెత్తడం పరిపాటిగా మారిందని ప్రయాణికులు విమర్శిస్తున్నారు.