1 July, 2026 | 9:18 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

మెట్రో మరో‘సారి’..

02-04-2025 11:39 PM

సాంకేతిక సమస్యలతో నిలిచిపోయిన మెట్రో రైలు..

ఇబ్బంది పడ్డ ప్రయాణికులు..

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రో రైలులో బుధవారం సాయంత్రం మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఎల్‌బీనగర్ నుంచి మియాపూర్‌కు వెళుతున్న ఓ మెట్రో రైలు అసెంబ్లీ మెట్రో స్టేషన్ వద్ద నిలిచిపోయింది. దీంతో దాదాపు 15 నిమిషాల పాటు మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. మెట్రోలో సమస్య తలెత్తడంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. మెట్రో సిబ్బంది వెంటనే సమస్యను పరిష్కరించడంతో తర్వాత మెట్రో సేవలు యథావిధిగా కొనసాగాయి. దీంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రతీ రెండు నెలలకోసారి మెట్రో రైలు సర్వీసులో సమస్యలు తలెత్తడం పరిపాటిగా మారిందని ప్రయాణికులు విమర్శిస్తున్నారు.