calender_icon.png 29 June, 2025 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలకు మైక్ సౌండ్ బహుకరణ

29-06-2025 12:40:09 AM

దౌల్తాబాద్,(విజయక్రాంతి): లయన్స్ క్లబ్ అప్ గజ్వేల్ స్నేహ ఆధ్వర్యంలో శనివారం రాయపోల్ మండల పరిధిలోని పెద్ద ఆరేపల్లి ప్రాథమిక పాఠశాలకు  మైక్ సౌండ్ పాఠశాల ఉపాధ్యాయులకు అందజేశారు. ఈ సందర్భంగా లైయన్స్ క్లబ్ స్నేహ గజ్వేల్ అధ్యక్షులు మల్లేశం గౌడ్, ట్రెజరీ సత్యనారాయణలు మాట్లాడుతూ విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలకు  వివిధ రకాల పాఠశాల నిర్వహించే కార్యక్రమాలకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉండేటట్లు పాఠశాలకు మైక్ సెట్ ను అందజేయడం జరిగిందన్నారు.

 దీని విలువ సుమారుగా రూ. 7500 రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన ఫలితాలు రావడం పట్ల సంతోషంగా ఉందన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకొని భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సంపాదించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామాలకు మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని విద్యార్థులు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి మంచి పురోగతి సాధించాలని కోరుకున్నారు. భవిష్యత్తులో కూడా పేద బడుగు బలహీన వర్గాలు చదువుకునే పాఠశాలలకు మా క్లబ్ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు.