29-06-2025 12:43:37 AM
బీఆర్ఎస్ ములుగు జిల్లా నాయకులు భూక్య జంపన్న
ములుగు,(విజయక్రాంతి): ప్రజా పాలన పేరుతో కౌలు రైతులను,భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలను ఆదుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందని బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ జిల్లా నాయకులు భూక్య జంపన్న ఆరోపించారు. గత ఎన్నికల సమయంలో వరంగల్ డిక్లరేషన్ లో ప్రకటించిన ఇందిరమ్మ రైతు భరోసా పేరిట కౌలు రైతులకు 15వేలు భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు 12వేలు ఏడాదికి రైతు భరోసా ఇస్తాం అని ప్రకటించి ఇప్పుడు చేతులు దులుపుకున్నారు అని తెలిపారు. అదే విధంగా గత పంటకు గానూ రైతులకు బోనస్ ఇస్తాం అని చెప్పి రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని, రైతులను అన్ని విధాలా నష్టం చేస్తుందని ఆయన తెలిపారు. రైతు కూలీలు,భూమి లేని రైతులకు రైతు బీమా పథకం వర్తింపు చేయాలని డిమాండ్ చేశారు.