18 March, 2026 | 6:50 PM

రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు మిడ్జిల్ విద్యార్తి ఎంపిక

10-11-2025 10:58 PM

మిడ్జిల్: బరిగెల సోనాక్షి మిడ్జిల్ సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. సోమవారం జిల్లాస్థాయిలో నిర్వహించిన ఖోఖో పోటీలలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక అయ్యింది. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన సోనాక్షిని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ హైమావతి బాల్ రెడ్డి, శశిరేఖ బాలు, మాజీ ఎంపీపీ దీప గోపాల్ రెడ్డి, బరిగెల సుదర్శన్, మాజీ సర్పంచ్ బరిగెల శారదా వెంకటయ్య, పాఠశాల కరస్పాండెంట్ జోసెఫ్, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బరిగెల దేవయ్య, బిజెపి జిల్లా అధ్యక్షులు రాజేశ్వర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు తిరుపతి, మండల అధ్యక్షుడు నరేష్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బాల్ రెడ్డి, రాజేశ్వర్, రాఘవేందర్ రెడ్డి, నాయకులు సాయిలు, మాజీ ఎంపీటీసీ గౌస్, సంపత్ కుమార్ ఘనంగా సత్కరించారు.