9 May, 2026 | 3:25 PM

Breaking News

బంద్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు   •   బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు.. స్పందించిన సబితా ఇంద్రారెడ్డి   •   రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్‌ ఇదే..!   •   వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు   •   సొసైటీ అసిస్టెంట్ మృతుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత   •   VOAల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం   •   శ్రీశైలంలో మరో సైబర్ మోసం.. ఢిల్లీ భక్తులకు టోకరా   •   బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •  

రోడ్డున పడ్డ వలసజీవులు

23-06-2024 12:05 AM
  1. రహదారి విస్తరణకు అడ్డుగా ఉన్న గుడిసెల తొలగింపు

బాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

ఎల్బీనగర్, జూన్ 22 : విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులతో వలసజీవుల బతుకులు రోడ్డున పడ్డాయి. జాతీయ రహదారి విస్తరణ పనులతో శుక్రవారం రాత్రి నేషనల్ హైవే అథారిటీ సిబ్బంది, జీహెచ్‌ఎంసీ, పోలీసులు బృందాలుగా ఏర్పడి హయత్‌నగర్ రేడియో స్టేషన్ పక్కన గల వినాయక విగ్రహాల తయారీదారులకు చెందిన 75 గుడిసెలను తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి శనివారం ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఓదార్చారు.

అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతూ.. 75 కుటుంబాలు ఇక్కడ అనేక ఏండ్లుగా నివసిస్తున్నాయని, వారికి ఆధారం చూపకుండా ఎలా గుడిసెలు తొలిగిస్తారని ప్రశ్నించారు. వినాయక విగ్రహాలు తయారీ చేసే వారిని వినాయక చవితి ముగిసేవరకు ఇక్కడే ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు అధికారులు ఒప్పకోవడంతో సమస్య సద్ధుమణిగింది. మాజీ కార్పొరేటర్లు సామ తిరుమల్‌రెడ్డి, కొప్పుల విఠల్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు నక్క రవీందర్‌గౌడ్, చెన్నగొని శ్రీధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.