9 May, 2026 | 2:14 PM

Breaking News

అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి   •   తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •  

అనుమతుల్లేని పాఠశాల సీజ్

23-06-2024 12:05 AM

అబ్దుల్లాపూర్‌మెట్, జూన్ 22 : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గౌరెల్లి గ్రామ పరిధిలోని రివర్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ యజమాన్యం పాఠశాల భవన నిర్మాణం పూర్తి చేయకుండానే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించింది. ఆకట్టుకునే బ్రోచర్లతో అడ్మిషన్లకు తెరలేపింది. అడ్డుకోవాల్సిన విద్యాశాఖ అధికారులు పాఠశాల నిర్వాహణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీనిపై ఈనెల 19న విజయక్రాంతి దినపత్రికలో ‘భవనం లేకున్నా.. బడికి అనుమతి’ శీర్షికతో వార్త ప్రచురితమైంది. ఈ కథనంపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. శనివారం పాఠశాలను సందర్శించిన అనంతరం సీజ్ చేస్తున్నట్లు  అబ్దుల్లాపూర్‌మెట్ ఎంఈవో వెంకట్‌రెడ్డి తెలిపారు.