07-10-2025 01:57:38 AM
హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి ) : పెట్టుబడులతో వచ్చే కంపెనీలు, పరిశ్రమలకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. హైదరాబాద్ ఇప్పటికే దేశంలోనే ఫార్మా హబ్గా పేరొందిందని, ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందన్నారు. ప్రపంచంలో దిగ్గజ కంపెనీగా పేరొం దిన ఫార్మా కంపెనీ ఎలి లిల్లీ దేశంలోనే మొదటిసారిగా తమ మాన్యుఫాక్షరింగ్ యూనిట్ను హైదరాబాద్లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది.
దీనితో తెలం గాణ మ రోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. తమ యూనిట్ ఏర్పాటుకు ఒక బిలిన్ డాల ర్ల (సుమారు రూ.9000 కోట్లు) భారీ పెట్టుబడులకు ఎలి లిల్లీ ముందుకొచ్చింది. దీం తో ఎలి లిల్లీ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా తమ ఔషధాల సరఫరా సామర్థ్యాన్ని విస్తరించనుంది. సోమవారం ఇంటిగ్రేటేడ్ క మాండ్ కంట్రోల్ సెంటర్లో ఎలి లిల్లీ కం పెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డితో స మావేశమయ్యారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు, ఎలి లిల్లీ సంస్థ ప్రెసిడెం ట్ ప్యాట్రిక్ జాన్సన్, లిల్లీ ఇండియా ప్రెసిడెంట్ విన్సెలో టుకర్, ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్, సీఎం స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ చర్చల అనంతరం ఎలి లిల్లీ కంపెనీ, త మ విస్తరణ ప్రణాళికలు.. తెలంగాణలో భారీ పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. రాష్ర్ట ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో దేశంలో అధునాతన తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
హైదరాబాద్లో ఏర్పాటుచేసే మా న్యుఫాక్షరింగ్, క్వాలిటీ హబ్ తమకు అత్యం త కీలకమైందని కంపెనీ తెలిపింది. ఇక్కడినుంచే దేశంలో ఉన్న ఎలి లిల్లీ కాంట్రాక్ మాన్యుఫాక్చరింగ్ నెట్వర్క్ సాంకేతిక పర్యవేక్షణ, నాణ్యత నియంత్రణ, అధునాతన సాంకేతిక సామర్థ్యాలను అందించనుంది. కొత్త హబ్ ఏర్పాటుతో మన రాష్ర్టంతో పాటు దేశంలో ఫార్మా రంగంలో పనిచేస్తున్న వేలాది మంది ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
వీలైనంత తొందరలోనే కెమిస్టులు, అనలిటికల్ సైంటిస్టులు, క్వాలిటీ కంట్రోల్, మేనేజ్మెంట్ నిపుణులు, ఇంజనీర్ల నియామకాలు చేపట్టనున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అమెరికాకు చెందిన ఎలి లిల్లీ కంపెనీ 150 ఏళ్లుగా ప్రపంచవ్యాపంగా ఔషధాల తయారీరంగంలో విశేషమైన వైద్య సేవలను అందిస్తుంది.
మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న ఈ అధునాతన యూనిట్, తెలంగాణను అత్యాధునిక ఆరోగ్య పెట్టుబడుల గమ్యస్థానంగా నిలబెట్టనుంది. ప్రధానంగా డయాబెటిస్, ఓబెసిటీ, ఆల్జీమర్, క్యాన్సర్, ఇమ్యూన్లోప వ్యాధులకు సంబంధించిన ఔషధాలు, కొత్త ఆవిష్కరణలపై ఈ కంపెనీ పనిచేస్తుంది. ఇండియాలో ఇప్పటికే గురుగ్రామ్, బెంగుళూరులో ఎలి లిల్లీ కంపెనీ కార్యకలాపా లున్నాయి. హైదరాబాద్లో ఈ ఏడాది ఆగస్టులోనే గ్లోబల్ కెపాబులిటీ సెంటర్ను ప్రారంభించింది.
తెలంగాణ అంటేనే బిజినెస్...
తెలంగాణ అంటేనే బిజినెస్ అని, గ్లోబల్ సిటీగా హైదరాబాద్ ఎదిగిందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. విస్తరణలో భాగంగా ఎల్ లిల్లీ కంపెనీ భారీ పెట్టుబడులకు ముందుకురావటం ఆనందంగా ఉందని, తెలంగాణకు ఇదొక గర్వ కారణమని పేర్కొన్నారు. తెలంగాణపై నమ్మకం ఉంచినందుకు కంపెనీ ప్రతినిధులను అభినందించారు. 1965లో ఇందిరాగాంధీ హైదరాబాద్కు ఐడీపీఎల్ తీసుకువచ్చినప్పటి నుంచి ఫార్మా రంగం విస్తరించిందన్నారు.
పేరొందిన దిగ్గజ ఫార్మా కంపెనీలుండటంతో 40 శాతం బల్క్ డ్రగ్స్ హైదరాబాద్లోనే ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్లను ఇక్కడే తయారు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఫార్మా కంపెనీలను ప్రోత్సహించే ఫార్మా పాలసీని ప్రభుత్వం అనుసరిస్తుందని చెప్పారు. జీనోమ్ వ్యాలీలో ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, జీనోమ్ వ్యాలీకి కావాల్సిన సాంకేతిక సహకారం అందిస్తామని వివరించారు.
హైదరాబాద్లో ఎలి లిల్లీ కంపెనీ విస్తరణ తెలంగాణలో పరిశ్రమల విస్తరణ తీరును ప్రతిబింబిస్తుందని మంత్రి శ్రీధర్బాబు అభిప్రాయపడ్డారు. రాష్ర్టంలో ఉన్న ప్రతిభావంతులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తుందని అన్నారు. ఎలి లిల్లీ విస్తరణ ఫార్మా రంగానికి కొత్త ఉత్తేజం అందిస్తుందని, ఇప్పటికే లైఫ్ సెన్సైస్ రంగంలో తెలంగాణ వేగవంతమైన వృద్ధి సాధిస్తోందని పేర్కొన్నారు.