calender_icon.png 7 June, 2025 | 11:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాలు,తరుగు పేరుతో మిల్లర్ల కుచ్చుటోపీ!

06-06-2025 12:10:52 AM

  1. నూటికి ఏడు కిలోల చొప్పున ధాన్యం తరుగు

సుమారు పదివేల మెట్రిక్ టన్నులు దాకా లూటీ

ట్రక్ షీట్ ఉన్నప్పటికీ కోతలు 

మంత్రి హెచ్చరించినా  మారని తీరు

తిలాపాపం తలా పిడికెడు  పంపకాలు.?

నాగర్ కర్నూల్ జూన్ 5 ( విజయక్రాంతి )దేశానికి అన్నం పెట్టే రైతన్నకు రైస్ మిల్లర్లు అధికారులతో కుమ్మక్కై సున్నం పెడుతున్నా రు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యా న్ని అమ్ముకునే క్రమంలో తేమ, తాలు, తరుగు సాకులు చూపి మిల్లర్లు క్వింటాల్ ధా న్యానికి సుమారు ఐదు నుంచి ఏడు కిలోల చొప్పున ధాన్యం కోతలు విధించారు.

ఓవై పు రుతుపవనాల రాకతో అకాల వర్షా లు రైతులను అతలాకుతలం చేస్తున్న పరిస్థితు ల్లో ఇదే ఆధునుగా భావించి ఆయా కొనుగోలు కేంద్రాలతో రైస్ మిల్లర్లు కుమ్మక్క య్యారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి న ధాన్యాన్ని నేరుగా మిల్లులకు పంపిన ధా న్యంతో పాటు ట్రక్ షీట్ పూర్తిస్థాయిలో తూకం వేసి గన్ని బ్యాగుల సంఖ్య నమోదు చేసినప్పటికీ అందులోనూ తేమ తరుగు తాలు సాకులు చూపి కోతలు విధించడం తో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయా మిల్లులకు రైతులు ధాన్యాన్ని అప్పగించామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని గత కొద్దిరోజుల క్రితం రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మం త్రి జూపల్లి కృష్ణారావుతో తమ గోడును వెల్లబోసుకోగా మిల్లర్లను పిలిపించి రైతుల మందే చివాట్లు పెట్టించారు. అనంతరం ఆయా రైస్ మిల్లర్లు రైతుల నుండి అక్రమంగా సేకరించిన ధాన్యాన్ని తిరిగి రికవరీ చేయాలని సం బంధిత అధికారులను మంత్రి జూపల్లి ఆదేశించారు.

అయినప్పటికీ నేటికీ రికవరీ చేయ కపోగా ధాన్యాన్ని తీసుకువెళ్లిన ధాన్యం బ స్తాల్లో తరుగు ఇంకా కొనసాగుతుండడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఐకెపి సెంటర్లు 70, ప్రాథమిక సహకార సంఘం సెంటర్లు 160, మె ప్మా సెంటర్లు రెండు చొప్పున మొత్తంగా 232 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా ఐకెపి సెంటర్లో 7,317 మంది రైతు లు 38,947 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించారు.

వీటి విలువ 89.57 లక్షలు. ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో 17,508 మంది రైతులు 1,06,032 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించారు. ధాన్యం విలువ 243. 87 లక్షలు, మెప్మా సెంటర్లలో 428 మంది రైతులు 3,428 మెట్రి క్ టన్నుల ధాన్యాన్ని విక్రయించారు.

వాటి విలువ 7.78 లక్షలు. కాగా వీరి నగదు రైతుల ఖాతాల్లో ఆలస్యంగా జమ అవుతుందని రైతులు మండిపడుతున్నారు. సన్న రకం వరి ధాన్యానికి బోనస్ డబ్బులు కూడా ఆలస్యం అవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

క్వింటాల్ కి 7 కిలోలు తరుగు...?

 రైతులు పండించిన ధాన్యాన్ని దళారుల పాలు కాకుండా కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలని అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కొంతమంది మిల్లర్లు అధికారులు, ఆయా కొనుగోలు కేంద్రాల నిర్వాహ కులతో మీలాకథ్ అవుతూ రైతులు విక్రయించిన ధాన్యాన్ని ట్రక్ షీట్ ద్వారా ఆయా లారీల తరలిస్తూ రైస్ మిల్లర్లకు అన్లోడింగ్ చేసే ప్రక్రియలో క్వింటాల్కి సుమారు 5 నుంచి 7 కిలోల చొప్పున తేమ తరుగు తా లు సాకులు చూపి నిండా ముంచారని రైతు లు పలుమార్లు అధికారుల దృష్టికి సైతం తీసుకువెళ్లారు.

అయినా కంటి తుడుపుగా పర్యటనలు చేస్తూ మరోసారి తప్పు జరిగితే చర్యలు తప్పవంటూ చెప్పుకుంటూ వచ్చారు కానీ మిల్లర్ల దోపిడీని మాత్రం అరికట్టలేకపోయారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 13 పారబైల్ మిల్లులు, మరో 33 రైస్ మిల్లులు మొత్తంగా 46 ఉండగా అన్ని కొనుగోలు కేం ద్రాల ద్వారా ఇప్పటివరకు 1,48 407 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఆయా మిల్లులకు తరలించారు.

ఇందులో కొన్ని రైస్ మిల్లర్లు గతంలో సేకరించిన ధాన్యాన్ని ఎఫ్సీఐ కి బి య్యం తరలించకపోయినా వారిని కాపాడుతూ రావడం పట్ల సర్వత్ర విమర్శలు వ్య క్తమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 50, 5 69 మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్సిఐ కి పం పాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. అయినా బ్లాక్ లిస్టులో ఉండాల్సిన మిల్లులు మళ్లీ ధాన్యా న్ని కేటాయించారన్న ఆరోపణలు ఉన్నాయి.

ప్రస్తుతం ఈ సీజన్లో 1,48,407 మెట్రిక్ ట న్నుల ధాన్యాన్ని సేకరించిన మిల్లర్లు సుమా రు క్వింటాల్ కి ఏడు రూపాయల చొప్పున తరుగు పేరుతో రైతుల నుండి దోచుకున్న ధాన్యం సుమారు పదివేల మెట్టనులకు పై గా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

మరి ఈ ధాన్యం అంతా రైతులకు చెందాల్సి ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు ఉన్నతాధికారులు ఆ దిశగా ఎందుకు అడుగులు వేయడం లేదని విమర్శలు బా హాటంగా వినిపిస్తున్నాయి. తిలాపాపం తలా పిటికడు రైతుల నుండి దోచుకున్న సొమ్మం తా పంచుకున్నారా అన్న అనుమానాలు సర్వత్ర వ్యక్తమవుతున్నాయి.