calender_icon.png 7 June, 2025 | 9:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏకగ్రీవంగా ‘కానిస్టేబుల్’ యూనిట్ ఎన్నిక

06-06-2025 12:10:55 AM

హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి సయ్యద్ మాజీదుల్లా హుస్సేని (ముజీబ్) ఆదేశాల మేరకు గురువారం ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ యూనిట్ ఎలక్షన్ అధికారిగా కేఆర్ రాజ్‌కుమార్ అసోసియేట్ అధ్యక్షుడు, సహా ఎలక్షన్ అధికారిగా ఏవీ శ్రీధర్ నాయుడు నియమితులయ్యా రు.

ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ యూనిట్ అధ్యక్షుడిగా మహ్మద్ నయీముద్దీన్, ఉపాధ్యక్షులుగా బీఎల్ సంతోష్, టీ. మల్లికార్జునరెడ్డి, పి.వీ.కమలాకర్‌రావు, కార్యదర్శిగా మహేశ్వర్‌రావు, సంయుక్త కార్యదర్శిగా యు సునీత, కోశాధికారిగా ఏ శివచారీ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా రవి నాయక్, ప్రచార కార్యదర్శి, ఈసీ సభ్యులుగా మహజబీన్, సునీల్, ప్రవీణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కార్యక్రమంలో టీఎన్జీవో  హైదరాబాదు జిల్లా కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్,  వైదిక్ శస్త్ర ప్రచార కార్యదర్శి, టీఎన్జీవో కేంద్ర సంఘం క్రీడా కార్యదర్శి బోలిగిద్ద శంకర్ పాల్గొన్నారు.