27-11-2025 12:10:18 AM
నకిరేకల్, నవంబర్ 26 (విజయ క్రాంతి): నకిరేకల్ పట్టణంలోని మూసి రోడ్ ఎస్ఎల్బిసి కాలువ దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ఆంజనేయం నకిరేకల్ మండల మినీ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఓనర్స్ & డ్రైవర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ఆఫీసును బుధవారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ చెవుగోని రజిత శ్రీనివాస్, కట్టంగూర్ మాజీ జడ్పిటీసీ మాదయాదగిరి,
స్థానిక కౌన్సిలర్ రాచకొండ సునీల్, నాయకులు ఫన్నాల రాఘవరెడ్డి, లింగాల వెంకన్న, మంగినపల్లి రాజు, గాదగోని కొండయ్య, ఆ ట్రాన్స్ పోర్టు గౌరవాధ్యక్షులు: అక్కినపల్లి శ్రీను,అధ్యక్షుడు: పొడిచేటి రాంబాబు, ఉపాధ్యక్షుడు: అక్కినపల్లిసైదులు, కార్యదర్శి: నరావుల మల్లేష్, సభ్యులు జె. అనిల్ కుమార్, శశి కుమార్, జి. ప్రవీణ్ కుమార్, శ్రీను, యాదయ్య, వీరయ్య, సుధాకర్, చంద్రశేఖర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.