calender_icon.png 23 December, 2025 | 4:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18,000గా నిర్ణయించాలి

23-12-2025 03:08:39 PM

నకిరేకల్,(విజయక్రాంతి): ఆశా వర్కర్లకు కనీస వేతనం నెలకు రూ.18,000గా నిర్ణయించి అమలు చేయాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తవిటి వెంకటమ్మ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మంగళవారం కట్టంగూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) ఎదుట ఆసంఘం కట్టంగూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  ఆశా వర్కర్లతో పారితోషికం లేని అనేక పనులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గత మూడు సంవత్సరాలుగా లెప్రసీసర్వేలునిర్వహించినప్పటికీ వాటికి సంబంధించిన బిల్లులు ఇప్పటివరకు చెల్లించలేదని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న లెప్రసీ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే ఈ సంవత్సరం చేపట్టే సర్వేలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.అదేవిధంగా స్థానిక ఎన్నికలు, పల్స్ పోలియో కార్యక్రమాల్లో పనిచేసిన ఆశా వర్కర్లకు సంబంధించిన బిల్లులు కూడా ఇంకా చెల్లించలేదని, వాటిని తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.