09-06-2025 04:33:06 PM
నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కోమటిరెడ్డి
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): ప్రజలకు న్యాయమైన సేవలు అందించడంలో ఏ విఫలత సహించబోమని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను హెచ్చరించారు. సోమవారం మంత్రి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం, ఆర్డిఓ కార్యాలయాన్ని పరిపాలన పరిస్థితులు, అధికారుల పనితీరుపై ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫైళ్లను పరిశీలించి, అధికారులను ప్రశ్నించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా విని, తగిన సూచనలు కూడా ఇచ్చారు. జిల్లా అభివృద్ధిలో ప్రతి అధికారికుడు తన బాధ్యతను నిబద్ధతతో నిర్వహించాలన్నారు. ఈ ఆకస్మిక తనిఖీలు జిల్లా పరిపాలనలో జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి, ప్రజల నమ్మకాన్ని పెంచడానికి దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.