calender_icon.png 10 February, 2026 | 6:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోన్ ట్యాపింగ్‌పై మరో బాంబ్ పేల్చిన మంత్రి పొంగులేటి

10-02-2026 04:08:49 PM

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు ఇంకా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారనే అనుమానం ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొందరి దగ్గర ఉన్నట్లు నిర్ధారణ అయిందని, ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని పొంగులేటి తెలిపారు. ఫామ్‌హౌస్‌లు, మామిడి తోటల్లో ఎక్కడేం పెట్టారో విచారణ జరుపుతామన్నారు. దొంగతనంగా ఫోన్ లు వింటున్నవారిపై చట్టరిత్యా చర్యలు తప్పవని, నేను మాట్లాడిన మాటలు ఎలా విన్నారో విచారణ చేస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు.