30-05-2025 03:02:05 PM
కన్నాల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు
మంథని(విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, ప్రజా సేవలో ఇలానే కొనసాగాలని కోరుతూ ఆయన జన్మ దినాన్ని పురస్కరించుకుని శుక్రవారం మండలంలోని కన్నాల కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం లో శ్రీధర్ బాబు పేరు మీద ప్రత్యేక పూజ, అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కేక్ కటింగ్(Minister Sridhar Babu birthday celebration) చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ చైర్మన్ ముస్కుల సురేందర్ రెడ్డి, మాజీ సర్పంచులు కావటి భూమయ్య, బెల్లం కొండ పుల్లారెడ్డి, చిదురాల దామోదర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు కావటి సందీప్, పోయిల శేఖర్, గుడిసె గట్టయ్య, తోకల మల్లేష్, కావటి సమ్మయ్య ,పర్వతాలు యాదవ్, జంగిలి శ్రీనివాస్ గుడిసే రాజయ్య, బుధవారం రాజయ్య, కొండ లచ్చయ్య, తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు