30-05-2025 03:17:22 PM
అడిగిన వారికి రేషన్ కార్డులు ఇస్తున్నాం
అధికారులు పారదర్శకంగా పనిచేయాలి:
హైదరాబాద్: ప్రతి ఒక్కరికీ ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్నామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ధాన్యం సేకరణ, వానాకాలం సాగు సన్నద్ధత, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి తదితర అంశాలపై మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... అడిగిన వారికి రేషన్ కార్డులు ఇస్తున్నాం.. ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఇస్తామని తెలిపారు. బియ్యమే కాకుండా ఇతర నిత్యావసరాలూ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో తలపెట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అత్యాధునిక పరికరాలు తీసుకువచ్చి ఎస్ఎల్ బీసీ టెన్నెల్ పనులు చేస్తామని పేర్కొన్నారు. అవినీతిరహిత పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. అధికారులు పారదర్శకంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. రెవెన్యూ, పోలీస్ శాఖల్లో అవినీతిని సహించబోమని మంత్రి హెచ్చరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. మా హయంలోనే ఎస్ఎల్ బీసీ పూర్తి చేస్తామని తెలిపారు. కృష్ణా జలాలపై ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని వెల్లడించారు. రాజీవ్ యువ వికాసానికి సిబిల్ స్కోర్ అవసరం లేని మంత్రి ఉత్తమ్ క్లారిటీ ఇచ్చారు.