calender_icon.png 6 June, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

18 నెలల్లోనే రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు: మంత్రి శ్రీధర్ బాబు

04-06-2025 02:46:06 PM

హైదరాబాద్: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉద్యోగాలు సృష్టించడం తన మొదటి ప్రాధాన్యతని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) వెల్లడించారు. హైదరాబాద్‌ను గ్లోబల్ టెక్, ఏఐ (Artificial intelligence) హబ్‌గా నిలిపేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ(Young India Skills University) ద్వారా నైపుణ్యాల అంతరాన్ని కూడా తాము తగ్గిస్తున్నామని తెలిపారు.

తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.  హైదరాబాద్‌లో ఎవర్జెంట్ టెక్నాలజీస్ గ్లోబల్ వాల్యూ సెంటర్‌(Evergent Technologies Global Value Center) విస్తరణకు మంత్రి శ్రీధర్ బాబు బుధవారం శంకుస్థాపన చేశారు. సంస్థ విస్తరణలో కొత్తగా వెయ్యి ఉద్యోగాలు వస్తాయని మంత్రి తెలిపారు. ఎవర్జెంట్ టెక్నాలజీస్ హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. వారి ప్రయాణంలో తమ ప్రభుత్వం పూర్తి మద్దతుకు హామీ ఇస్తున్నానని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.