calender_icon.png 6 June, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది..

04-06-2025 01:51:19 PM

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు..

కాంగ్రెస్ సర్కారులో అవినీతికి తావు లేదు.. 

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు..

పెద్దపల్లి, (విజయక్రాంతి): అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ విజయ రామారావు. ఓదెల మండలం, గుండ్లపల్లి గ్రామంలో బుధవారం రోజున రూ. 8,00,000 నిధులతో సీసీ రోడ్ల నిర్మాణల  కోసం స్థానిక నాయకులతో శంకుస్థాపన చేసి అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేసి నూతన ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ చేసి పనులను పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ.. పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వం 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందన్నారు. ఈ గ్రామంలో 25 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా 15 ఇండ్లకు ముగ్గురు పోయడం జరిగింది అన్నారు. స్పెషల్ డెవలప్మెంట్ కింద 8 లక్షలతో సిసి రోడ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది అన్నారు.

15 నెలల కాలంలోనే ఈ గ్రామంలో 40 లక్షలతో సిసి రోడ్లు కు నిధులు ఇవ్వడం జరిగింది అన్నారు. ఈ గ్రామంలో ప్రతి గల్లీకి సీసీ రోడ్డు నిర్మించడంతో పాటు డ్రైనేజీ నిర్మాణాలు కూడా చేపడుతామన్నారు. దశలవారీగా గ్రామాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది అన్నారు. 17 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు, ఇండ్లు, అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజి పడకుండా అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. బిఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఇంతవరకు నిరుపేదలకు ఇల్లు ఇవ్వకుండా మోసం చేసింది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక  సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంది అన్నారు.

శానకొండ గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద 42 ఇళ్ల వరకు బేస్ మెట్లు కాగా వారందరికీ లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అన్నారు. ఇల్లు కట్టుకున్న వారికి ప్రభుత్వం ఐదు లక్షలు ఇస్తుంది అన్నారు. శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాను అన్నారు. ప్రభుత్వం సన్నవడ్లకు బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటుంది అన్నారు. గత 30 సంవత్సరాలుగా ఎన్నడు లేని విధంగా ఈ వేసంగి ఘనైనిమైన వరి పంట పండిందని రైతులకు 10 నుంచి 15bవేల రూపాయలు అదనపు లాభం వచ్చిందన్నారు. ఈ వేసవిలో సన్న ధాన్యం పండించిన రైతులకు 31కోట్లు ఆపైన రూపాయలు ఈ వారం రోజుల్లో ప్రభుత్వం బోనస్ వేస్తుంది అన్నారు. ప్రభుత్వం బోనస్ ఇవ్వడంతో సీడ్ కంపెనీలు కూడా రైతులకు అదనంగా వడ్లకు ధర పెంచింది అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, పుప్పాల శంకర్, గ్రామ శాఖ అధ్యక్షులు పెద్దిరెడ్డి రఘుపతి రెడ్డి,పడాల రాజు, సింగిల్ విండో అధ్యక్షులు ఆళ్ల సుమన్ రెడ్డి, ఆకుల మహేందర్, చీకట్ల మొండయ్య, రెడ్డి రజినీకాంత్, సాగర్ రెడ్డి, మాజీ సర్పంచ్, ఎంపీటీసీ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.