04-06-2025 02:50:39 PM
జడ్చర్ల: విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో మరో ప్రాణం బలి అయింది. ప్రధాన రోడ్లపై విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్ఫార్మర్లు ఉన్న వాటి చుట్టూ కంచ ఏర్పాటు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఏండ్ల తరబడి ఈ సమస్య ఉన్నప్పటికీ నివారణ చర్యలు మాత్రం తీసుకోవడం లేదని ఆరోపణలు బలంగా ఉన్నాయి. విద్యుత్ శాఖ నిర్లక్ష్య కారణంగానే ట్రాన్స్ఫారంకి కంచ ఏర్పాటు చేయడంతో ఓ బాలుడు మృత్యువాత పడాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
జడ్చర్ల పట్టణంలోని సరస్వతి నగర్ కాలనీలో ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఈరోజు ఉదయం ప్రమాదవశత్తు కాంగ్రెస్ పార్టీ నాయకుడు బోక్క రాఘవేందర్ చిన్న కుమారుడు శ్రేయన్స్ ప్రమాదానికి గురై వృత్తి చెందారు. ఇక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్ దగ్గర చుట్టూ ఫెన్సింగ్ వేయాలని పలుమార్లు విద్యుత్ శాఖ వారికి తెలియజేసినప్పటికీ వారు నిర్లక్ష్యం వహించి చేయకపోవడంతో పసిప్రాణం పోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎన్నోసార్లు తెలియజేసినప్పటికీ స్పందించలేదు కాగా బోక్క రాఘవేందర్ తన సొంత ఖర్చులతో కంచే నిర్మాణం చేపడుతానంటే కూడా స్పందించ లేదని, ఒక నిండు ప్రాణం పోయిందని విమర్శలు వెలువెత్తుతున్నాయి. నిర్లక్ష్యం వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
-కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి
ఎంతో భవిష్యత్తు ఉన్న బాలుడు విద్యుత్ ప్రమాదానికి గురై చనిపోవడం చాలా బాధాకరమని మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు కారమైన పూర్తి విచారణ చేయాలని ఆయన కోరారు. కుటుంబ సభ్యులను మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఓదార్చారు.