శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి
అడవి శ్రీరాంపూర్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపనలో రాష్ట్రమంత్రి శ్రీధర్ బాబు
ముత్తారం,మే09(విజయ క్రాంతి): శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని మండలంలోని అడవి శ్రీరాంపూర్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపనలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతి యాదవ్, సిగ్గులేకుండా చైర్మన్ అల్లాడి యాదగిరిరావు, మాజీ జడ్పీటీసీ నాగినేని జగన్మోహన్ రావు, ఏఎంసీ వైస్ చైర్మన్ మద్దెల రాజయ్య, నాయకులు వాజీద్ షాషా, జావిద్ పాషా, రఫి, అధిక సంఖ్యలో గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.






