15 July, 2026 | 6:07 AM

ఉద్యోగులను హెచ్చరించిన మంత్రి తుమ్మల

04-07-2024 12:14 PM

హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు సకాలంలో హాజరుకావాలని, కార్యాలయంలో కలిసి పనిచేయడం వల్ల తమ దృష్టికి వచ్చే ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం అన్నారు. ఎల్బీస్టేడియం సమీపంలోని వ్యవసాయశాఖ కార్యాలయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆకస్మికంగా సందర్శించారు. ఉద్యోగులు హాజరుకావడంతో విస్తుపోయారు. ఉద్యోగులు సమయానికి హాజరు కాకపోతే చర్యలు తప్పవన్నారుశుక్రవారం నుంచి సకాలంలో విధుల్లో చేరాలని, లేనిపక్షంలో శాఖాపరమైన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. సిబ్బంది హాజరు తీరును పర్యవేక్షించి సమగ్ర నివేదిక సమర్పించాలని వ్యవసాయ డైరెక్టర్‌ను మంత్రి కోరారు.