15-06-2025 12:31:59 AM
-దర్యాప్తు చేస్తున్న పోలీసులు
న్యూఢిల్లీ, జూన్ 14: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ తుపాకీ పేలింది. శనివారం ఓ దుండగుడు న్యాయవాదులపై కాల్పులకు పాల్పడ్డాడు. మి న్నేసోటాలో జరిగిన ఈ ఘటనలో ఆ రాష్ట్ర మాజీ హౌస్ స్పీకర్ మెలిసా హర్ట్మెన్, ఆమె భర్త మార్క్ ప్రాణా లు కోల్పోగా.. సెనెటర్ జాన్ హాఫ్మాన్ గాయపడ్డారు.
ఈ ఘటన రాజకీయ ప్రేరేపిత దాడి అని మి న్నేసోట గవర్నర్ టిమ్ వాల్జ్ మీడియా కు తెలిపారు. చనిపోయిన ఇద్దరూ మిన్నేసోటా డెమోక్రటిక్. పార్టీకి చెందిన వారు. 2004లో మిన్నెసోటా ప్రతినిధుల సభకు ఎన్నికైనా మెలిసా తాజాగా 2022లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. గాయపడ్డ జాన్ హాప్ మాన్ విషయానికి వస్తే ఆయన 2012 నుంచి సెనేట్లో సభ్యుడిగా ఉన్నారు.