15-06-2025 12:34:20 AM
- మూడోసారి బయల్దేరగా వక్రీంచిన విధి
- తన లక్కీ నెంబర్ తేదీరోజే మృతిచెందిన గుజరాత్ మాజీ సీఎం రూపాణీ
న్యూఢిల్లీ, జూన్ 14: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతిచెందిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణీ ప్రయా ణానికి సంబంధించి మరో కీలక విషయం వెలుగుచూసింది. లండన్లో ఉన్న తన భార్య, కూతురిని కలిసేందుకు వెళ్తున్న రూపాణీ.. అంతకుముందు రెండుసార్లు వెళ్లేం దుకు సిద్ధమై, టికెట్ రద్దు చేసుకున్నట్టు తెలిసింది.
చివరకు మూడోసారి బయలుదేరిప్పటికీ విమాన ప్రమాదంలో ఆయన ప్రాణాలు విడిచారు. తన లక్కీ నెంబర్గా భావించే 1206 సంఖ్య కలిగిన తేదీ రో జే ఆయన మృతిచెందడం విషాదకరం. రూపాణీ వ్యక్తిగత వాహనాలన్నీ 1206తోనే ఉన్నట్టు సమాచారం. విజయ్ రుపాణీ తన భార్యతో కలిసి లండన్ వెళ్లేందుకు మే నెలలోనే ఎయిరిండియా 171 విమానంలో టికె ట్ బుక్ చేసుకున్నారు.
అనివార్య కారణాల వల్ల తన ప్రయాణాన్ని రద్దు చేసుకొని, భా ర్యను పంపించారు. మళ్లీ జూన్ 5న టికెట్ బుక్ చేసుకొని, దాన్నీ క్యాన్సల్ చేసుకున్నా రు. బీజేపీ పంజాబ్ ఇన్చార్జిగా ఉన్న రూ పాణీ.. లుథియానా ఉప ఎన్నిక కోసం తన ప్రయాణాన్ని రెండుసార్లు విరమించుకున్న ట్టు తెలుస్తోంది. చివరగా జూన్ 12న లండన్కు బయలుదేరిన ఆయన, విమాన ప్రమా దంలో ప్రాణాలు కోల్పోయారు.