18-06-2025 12:48:39 AM
మహేశ్వరం,జూన్ 17 : మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రముఖ పెద్ద చేరువును మాజీ మంత్రి,మహేశ్వరం ఎమ్మె ల్యే పి.సబితా ఇంద్రారెడ్డి మంగళవారం సందర్శించారు. చేరువు పరిస రాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆమె సమీక్షించారు. చేరువును మూడు కిలోమీటర్ల మేర పాదయాత్రగా పరిశీలించారు. ఆమె అక్కడి సమస్యలను నేరుగా గుర్తించారు.
బతుకమ్మ ఘాట్, వాకర్స్ కోసం ఏర్పాటు చేస్తున్న వాకింగ్ ట్రాక్, ఫెన్సింగ్, స్ట్రీట్ లైట్స్,వాలీబాల్ కోర్ట్, క్రికెట్ గ్రౌండ్, చెరువు అందచందాల కోసం చేపట్టిన సుందరీకరణ పనుల పురోగతిని అధికారులతో సమీక్షించారు. చెరువుకు ఆనుకొని ఉన్న వైకుంఠధామాల పరిస్థితిని కూడా పరిశీలించిన ఆమె, ప్రజలకు మరింత మెరుగైన సదుపాయాలు అందించేందుకు తీసుకోవలసిన చర్యలపై అధికారులకు సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆమెతోపాటు మీర్పేట్ మున్సిపల్ కమిషనర్ జ్ఞానేశ్వర్, డీ.ఈ.వెంకన్న,ఏఈ తదితర అధికారులు, కార్పొరేషన్ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి, దిండు భూపేష్ గౌడ్, అర్కల భూపాల్ రెడ్డి,రాజ్ కుమార్, రామిడి రామిరెడ్డి, బోయపల్లి శేఖర్ రెడ్డి, దీప్లాల్ చౌహాన్, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మదారి రమేష్, సిద్ధల అంజయ్య,పల్లె జంగయ్య, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ సోషల్ మీడియా కన్వీనర్ వీర రాఘవరెడ్డి,మహిళా అధ్యక్షురాలు సునీత బాలరాజ్, విజయలక్ష్మి, నిర్మల తదితరులు పాల్గొన్నారు.