calender_icon.png 18 June, 2025 | 11:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు నత్తనడక

18-06-2025 12:47:03 AM

ఘట్ కేసర్, జూన్ 17 : ఘట్ కేసర్ పట్టణంలో నిర్మిస్తున్న రైల్వే వంతెన నిర్మాణ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నత్తనడకన కొనసాగుతున్నాయని ఘట్ కేసర్ మాజీ సర్పం అబ్బసాని యాదగిరి యాదవ్ ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వంతెన నిర్మాణ కాంట్రాక్టర్ అగ్రిమెంట్ ప్రకారం పని చేయడం లేదన్నారు.

భారీ నిర్మాణం పనికి కావాల్సిన కార్మికులను ఏర్పాటు చేయకుండా ఐదు, ఆరు గురితో పనిచేయిస్తే ఎప్పుడు పూర్తవుతుందని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ తో పాటు అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తూ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఇతర ప్రాంతాలలో వంతెన నిర్మాణాలు పూర్తి అవుతున్న ఇక్కడ ఎందుకు కావడంలేదన్నారు.

కాంట్రాక్టర్ వంతెన పనులు వేగవంతం చేయకుండా డబ్బులు లేవని సాకులు చెబుతూ కొత్త టెండర్లు ఎందుకు వేస్తున్నట్లు అని ఆయన ప్రశ్నించారు. 2007 వ సంవత్సరం వంతెన పనులకు శంకుస్థాపన జరిగి అనంతరం పనులు ప్రారంభం జరిగి 18 సంవత్సరాలు అవుతున్న పూర్తి కావడం లేదని విచారం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన వంతెన నిర్మాణం మాత్రం పూర్తి చేసిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

బాధితులకు నష్టపరిహారం అందించకుండా కోర్టు కేసులని ఇంకా ఎన్ని సంవత్సరాలు జరుపుతారని పాలకులు, అధికారుల తీరు పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడం సరైన రోడ్డు లేకపోవడం పట్టణంలోకి డిస్టిక్ బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు, ప్రజలు మహిళలు, వృద్ధుల ఇబ్బందులు వర్ణించలేనిమన్నారు. ఈ సమస్యలపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని, స్థానిక ప్రజలతో జాతీయ రహదారిని దిగ్బంధం చేస్తానని హెచ్చరించారు.