calender_icon.png 1 June, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్య విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదు

30-05-2025 06:52:59 PM

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

హనుమకొండ,(విజయక్రాంతి): శివునిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాత్కాలికంగా డిగ్రీ కళాశాల తరగతుల నిర్వహణ నేపథ్యంలో కళాశాలలో విద్యార్థులకు కనీస వసతుల ఏర్పాట్లపై ఎమ్మెల్యే, అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా కళాశాలో ప్రస్తుత పరిస్థితులను ప్రిన్సిపల్, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాలలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడంతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ... స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరిందని అన్నారు.

మార్చి నెలలో రూ.8,04,59,000 లతో నూతన డిగ్రీ కళాశాల మంజూరు రావడం జరిగిందన్నారు. డిగ్రీ కళాశాలకు అవసరమైన 18 మంది అధ్యాపకులు, 8 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఏర్పాటుకు మంజూరైనది. బిఎ, బికాం కంప్యూటర్, బిఎస్సి కంప్యూటర్, ఎంపీసీ, బి జెడ్ సి లైఫ్ సైన్స్, కంప్యూటర్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, మొత్తం 240 సీట్ల అడ్మిషన్ల కొరకు విద్యార్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. నియోజకవర్గంలోని  10 ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు డిగ్రీకళాశాలలో అడ్మిషన్లు పొందుతారని తెలిపారు. ఉపాద్యాయులు అంకితభావంతో పనిచేయాలన్నారు.

అప్పుడే విద్యార్థుల భవిష్యత్తు మెరుగుపడుతుందని, ప్రభుత్వ విద్యాలయాలు దయనీయ స్థితికి చేరకుండా ఉంటుందన్నారు. ప్రస్తుతం డిగ్రీ కళాశాల విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు వెంటనే టాయిలెట్స్, ఎలక్ట్రిసిటీ, ఫ్యాన్స్, ఫర్నిచర్, డిజిటల్ బోర్డు, త్రాగునీరు సౌకర్యాలతో పాటు పరిసరాలను శుభ్రం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది కల్లా శాశ్వత డిగ్రీ కళాశాల భవనం విద్యార్థులకు అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా, డి ఈ, ఆర్డిఓ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.