30-05-2025 06:41:50 PM
మహదేవపూర్,(భూపాలపల్లి),(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి సన్నిధిలో శుక్రవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు లేతకారి రాజబాబు, మండల ప్రధాన కార్యదర్శి పవన్ శర్మ, ఆధ్వర్యంలో మహా మృత్యుంజయ హోమం, శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వరునికి అభిషేకాలు, నిర్వహించినారు.
ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి సన్నిధిలో వేద పండితుల ఆధ్వర్యంలో మహా మృత్యుంజయ హోమం, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వరునికి అభిషేకాలు, శ్రీ శుభానంద దేవి అమ్మవారికి కుంకుమార్చనలు మంత్రి కుటుంబ సభ్యుల అందరూ చల్లగా ఉండాలని నిర్వహించమని తెలిపారు.
ఎస్సీ సెల్ అధ్యక్షులు మాట్లాడుతూ... శ్రీధర్ బాబు ఈ నెలలో నిర్వహించిన సరస్వతి పుష్కరాలను చాలెంజిగా తీసుకొని ఘనంగా నిర్వహించడం జరిగిందని, రాబోవు రోజులలో మంత్రి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతూ మంథిని నియోజకవర్గానికి అభివృద్ధి ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గుడాల అరుణ శ్రీనివాస్ సీనియర్ నాయకులు షకీల్, అమృతం సారయ్య, లేతకరి రవి, ఇనుముల సడవాలి, కొండగొర్ల సంతోష్ ,తూనూరి సంతోష్, పాణ్యం శీను తదితరులు పాల్గొన్నారు.