15 April, 2026 | 1:55 PM

Breaking News

పేకాట ఆడుతున్నారనే నెపంతో ఎస్ఐ దాడి... పోలీస్ స్టేషన్ ఎదుట 100 మంది ధర్నా   •   ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •  

మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదు: రాజగోపాల్ రెడ్డి

13-04-2025 02:58 PM

మంత్రి పదవిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారు

నేడు అడుక్కునే స్థితిలో ఎప్పుడూ ఉండను

మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదు

హైదరాబాద్:  మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇస్తానని పార్టీ హామీ ఇచ్చిందని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తన మంత్రి పదవి(Minister post) విషయంలో కొందరు రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జానారెడ్డి(Kunduru Jana Reddy) వంటి వారు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను అడుక్కునే స్థితిలో ఉండనని.. మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదని తేల్చిచెప్పారు. జానారెడ్డి 30 ఏళ్లపాటు మంత్రి పదవి అనుభవిచారని చెప్పిన రాజగోపాల్ రెడ్డి రంగారెడ్డి, హైదరాబాద్ కు పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అని ప్రశ్నించారు.